ముంబై, చెన్నై, బెంగళూరు మరియు కోల్కతాలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించినట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ స్పష్టం చేసింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని హెచ్చరించింది. ఢిల్లీలో ఏడాదికి దాదాపు 12,000 కాలుష్య సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి. ఇది మొత్తం మరణాలలో 11.5 శాతంగా పరిగణించింది. ఢిల్లీ తర్వాత వారణాసిలో అత్యధిక మరణాలు సంభవించాయి. ప్రతి సంవత్సరం 830 మంది మరణిస్తున్నారు.