గుంతకల్లులో వ్యక్తి దారుణ హత్య

56చూసినవారు
గుంతకల్లులో వ్యక్తి దారుణ హత్య
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నల్లదాసరపల్లి వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళ్తున్న ఆవుల లక్ష్మన్నపై కొందరు దుండగులు కాపు కాసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవుల లక్ష్మన్న అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుంతకల్లు గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్