ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే సామాజిక పింఛన్లకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. తాజాగా మరో హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.