అధికారులు పద్ధతి మార్చుకోవాలి: మంత్రి నాదెండ్ల

56చూసినవారు
అధికారులు పద్ధతి మార్చుకోవాలి: మంత్రి నాదెండ్ల
AP: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో అధికారుల‌తో ఆహార, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమీక్ష నిర్వ‌హించారు. "మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం కోసం శాఖలన్నీ పనిచేశాయి. కాకినాడకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేల లారీల బియ్యం తరలించారు. పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలింది. ఈ ప్రభుత్వంలో అవేవీ చెల్లవు.. అధికారులు పద్ధతి మార్చుకోవాలి." అని అధికారుల‌కు మంత్రి స్ప‌ష్టం చేశారు.

సంబంధిత పోస్ట్