తాజాగా మహారాష్ట్రలోని ఓ వైద్యుడు ఐస్క్రీమ్లో ఓ వ్యక్తి వేలిని గుర్తించడం సంచలనంగా మారింది. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. తాజాగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీఎన్ఏ పరీక్షలో ఆ వేలు పూణెలోని ఓ ఐస్క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓంకార్ పొటేదని చెందినదని తేలింది. ఐస్ క్రీం నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి యంత్రంలో పడి మధ్యవేలు తెగిపోయింది. అది ఆన్లైన్లో ఆర్డర్ చేయడంతో ఓ డాక్టర్కి చేరింది.