72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ (వీడియో)

71చూసినవారు
భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు, BRO సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్