లారీ కింద పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. విజయవాడలోని చనుమోలు వెంకట్రావు పై వంతెన వద్ద లారీని బైక్ ఢీకొట్టింది. బైకుపై వెళ్తుండగా లారీ ట్రాలీ హుక్కు యువకుడి బ్యాగు చిక్కుకుంది. కొంతదూరం ఈడ్చుకెళ్లిన తర్వాత లారీ చక్రాల కిందపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు కంచికచర్లకు చెందిన హర్షవర్ధన్గా గుర్తించారు.