ఏపీలో సంచలనం రేపిన MRO రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మురారి సబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో చెన్నై వెళ్లిన బృందం గంగారావును అరెస్ట్ చేసింది. స్థిరాస్తి లావాదేవీలే MRO రమణయ్య హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.