రాష్ట్రస్థాయి జూడో గేమ్స్ కి విద్యార్థుల ఎంపిక

78చూసినవారు
రాష్ట్రస్థాయి జూడో గేమ్స్ కి విద్యార్థుల ఎంపిక
రాష్ట్రస్థాయి జూడో గేమ్స్ కి వడ్డాది హైస్కూల్ కి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 19న అనకాపల్లిలో జరిగిన జోనల్ స్థాయి జూడో గేమ్స్ పోటీలలో ఎనిమిదో తరగతి విద్యార్థులు దాసరి రోహిణి, ఆర్. రిషి, జి. చరణ్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 23 నుండి తిరుపతిలో జరగబోయే స్టేట్ జూడో గేమ్స్ లోవీరు పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం విద్యార్థులను హెచ్ఎం పివి శేషుబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్