తమకు చదువంటే ఇష్టం. తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆ ఆదివాసీ గిరిజనులు ఆశ పడ్డారు. అయితే పాఠశాల లేకపోవడంతో ఊరంతా ఏకమై శ్రమదానంతో ఓ చిన్న పాఠశాలను నిర్మించారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడలో ఈ సంఘటన జరిగింది. పాఠశాల సక్రమంగా లేకపోవడంతో ఆరుబయటే పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈనేపథ్యంలో తల్లిదండ్రులు,
విద్యార్థులు కలిసి సోమవారం పూరి గుడిసె నిర్మించారు.