విశాఖ: డిజిటల్ మార్కెటింగ్‌తో అధిక ప్రయోజనాలు

84చూసినవారు
విశాఖ: డిజిటల్ మార్కెటింగ్‌తో అధిక ప్రయోజనాలు
విశాఖ జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, ఇతర ఉత్పత్తి దారులు డిజిటల్ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫాంలో అందరూ చేరాలని చెప్పారు. జిల్లా పరిశ్రమలు, ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగింది.

సంబంధిత పోస్ట్