అమరావతికి.. అందలం

566చూసినవారు
అమరావతికి.. అందలం
మోదీ 3.0 బడ్జెట్‌ అమరావతి బాట పట్టింది. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో ఊసే లేకుండా పోయిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాధ్యత మాదంటూ కేంద్రం బడ్జెట్‌లో భరోసా ఇచ్చింది. నిర్మలాసీతారామన్‌ తన బడ్జెట్‌లో అమరావతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై అటు రాష్ట్రప్రజలతో పాటు అమరావతివాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అటు తరతరాల నుంచి ఉన్న భూములను అమరావతి కోసం ఇచ్చి జగన్‌ నిర్లక్ష్యంతో రోడ్డెక్కిన రాజధాని రైతులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.

సంబంధిత పోస్ట్