అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు సోమవారం కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలతో ఆలయంలోప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులతోపాటు స్థానిక ప్రజలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. విశాఖకమిషనర్ రవిశంకర్, జిల్లాఎస్పీ కేవీ మురళీకృష్ణ బందోబస్తు నిర్వహించారు.