పొలాల్లోకి దూసుకుపోయిన బ‌స్సు

51చూసినవారు
అనకాపల్లి జిల్లా మార్టురు సమీపంలో బ్రాండెక్స్ కంపెనీ బస్సు అదుపు త‌ప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. స్టీరింగ్ విరిగిపోవ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. బుధ‌వారం ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌స్సులో సుమారు 50 మంది కార్మికులున్నారు. వీరిలో ఎక్కువ మంది మ‌హిళ‌లు ఉన్నారు. అయితే ప్ర‌మాదంలో కొంద‌రికి స్వ‌ల్ప‌గాయాలు మాత్ర‌మే కావ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్