మాన్యం కాలువ పనులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి

79చూసినవారు
మాన్యం కాలువ పనులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి
జాలంపల్లి పెద్దేరు రిజర్వాయరు వేల ఎకరాలకు నీటిని పంటపొలాలకు సరఫరా చేస్తుంది. దీనిలో భాగంగానే కింతలి వల్లాపురం పంటపొలాలకు కూడా నీరు సరఫరా అవుతుంది. అయితే గత ఖరీఫ్ సీజన్లో మాన్యం కట్టు వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మాన్యం కట్టు నుంచి కొమ్ముకాలువ రైతులకు నీరు అందడం లేదు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో పొలాలు నీటి ఎద్దడికి గురి కానున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి, త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్