నర్సీపట్నంలో ట్రాఫిక్ జామ్

79చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ ఐదురోడ్ల జంక్షన్ సమీపంలో గురువారం రాత్రి లారీ ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కేడీ పేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అనేక వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో పోలీసులకు లారీ యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్