ఎలమంచిలి: నాణ్యమైన భోజనం పెట్టాలి

59చూసినవారు
బీసీ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని విద్యార్థినులు గురువారం ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఎలమంచిలి మెయిన్ రోడ్డు పై ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ డివిజన్ కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ వసతి గృహాల్లో పెట్టే భోజనం రుచిగా ఉండటం లేదన్నారు. అలాగే మెనూ పాటించడం లేదని అన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్