త్రాగునీటి కార్మికుల సమ్మె విరమణ

84చూసినవారు
త్రాగునీటి కార్మికుల సమ్మె విరమణ
జిల్లాలో ఉన్న శ్రీరామిరెడ్డి, సత్యసాయి త్రాగునీటి కార్మికుల సమ్మె 13 రోజులుగా కొనసాగుతుంది.‌ నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిఐటియూ నాయకులు, కార్మికులతో చర్చలు జరిపి రెండుమూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమింపజేశారు. కలెక్టర్ హామీ మేరకు సమ్మె విరమింపజేసుకుంటున్నామని, జీతాలు చెల్లించకపోతే నెలాఖరున మరలా సమ్మెలోకి వెల్తామని వారు తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో నేటి నుండి ప్రతి గ్రామానికి నీళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్