సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహములో అవసరమైన మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తాడిపత్రి పట్టణంలోని నందలపాడు వద్దనున్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలో మరుగుదొడ్లు, ట్యాప్ లు, తదితర అవసరమైన అన్ని రకాల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.