బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా

81చూసినవారు
శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు నెలనెలా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ శనివారం కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ప్రధాన నీటి పంపింగు కేంద్రం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్