ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. భజన బృందం వారు ఆంజనేయ స్వామి భజనలు, కీర్తన నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు పాల్గొన్నారు.