ప్రతిఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి

558చూసినవారు
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ జి. శివభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ఉరవకొండ మండలం రాంపురం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డిఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ అర్బన్ సి. ఐ ఎం. సురేష్ బాబు, ఎస్సై ఎన్. రాఘవేంద్రప్ప, గుంతకల్లు సబ్ డివిజన్ స్పెషల్ పార్టీలు, ఉరవకొండ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్