పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు విడుదల చేయాలి

80చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉరవకొండ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినీలను ఉద్దేశించి మాట్లాడారు. హాస్టళ్ల సమస్యలపై ఆగస్టు 6న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్