నామినేషన్ల దాఖలులో నిబంధనలు పాటించాల్సిందే

78చూసినవారు
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 18 నుంచి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆర్వో, జిల్లా సంయుక్త కలెక్టరు కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఉరవకొండ ఆర్వో కార్యాలయంలో మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందన్నారు. 21న స్వీకరణ ఉండదన్నారు. రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఆ సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్