ముగిసిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

52చూసినవారు
ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసిందని ఆర్వో కేతన్ గార్గ్ తెలిపారు. ఈ అసెంబ్లీ స్థానానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 5 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 11 మంది అభ్యర్థుల నామినేషన్లను సమ్మతించారు. ఈనెల 29వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందిని ఆర్వో ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్