అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీ వద్ద జలవనరులశాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనం ఇది. జలవనరులశాఖ అనుమతి లేకుండానే నిర్మాణం తుదిదశకు చేరింది. ఈ వైసీపీ కార్యాలయానికి జూన్ 22న మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుకు ఏడురోజుల్లో వివరణ ఇవ్వాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.