జనవరి 27 ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ధర్మవరం పట్టణానికి చెందిన ఎలక్ట్రిషన్ సంఘం సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ధర్మవరం పట్టణంలో ఎలక్ట్రికల్ పితామహుడు సర్ థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మవరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎలక్ట్రీషియన్ లందరు తమ సమస్యలపై చర్చించుకున్నారు.