ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ధనుంజయ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రి నుండి ధర్మవరం వస్తున్న ఓ లారీ వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆటో ను ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ ధనంజయ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.