విశ్రాంత రెవిన్యూ అధికారులకు ఘన సన్మానం

65చూసినవారు
విశ్రాంత రెవిన్యూ అధికారులకు ఘన సన్మానం
గుంతకల్లు రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రెవిన్యూ దినోత్సవం సందర్భంగా విశ్రాంత రెవిన్యూ అధికారులకు ఘన సన్మానం నిర్వహించారు. విశ్రాంత తహసీల్దార్లు రాముడు, చలపతి తదితర రెవిన్యూ ఉద్యోగులను ఆర్డీఓ శ్రీనివాసులు శాలువాలతో సన్మానించారు. ప్రజా సేవలో రెవిన్యూ శాఖ కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు శేషఫణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్