రహదారి సౌకర్యం కల్పించండి: సిపిఎం

83చూసినవారు
రహదారి సౌకర్యం కల్పించండి: సిపిఎం
గుంతకల్లు పట్టణంలోని మస్తాన్ పేట సమీపంలోని రెడ్ ట్యాంకు వద్ద రైల్వే ప్రహరీ మధ్య రైల్వే అధికారులు నిర్మించిన గోడను తొలగింపజేసి ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు రైల్వే అధికారులతో చర్చించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్