ఆలయాల్లో ప్రత్యేక పూజలు

53చూసినవారు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అమావాస్యను పురస్కరించుకొని హిందూపురం పట్టణ పరిధిలో పలు ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనిమహాత్మస్వామి అమావాస్య రోజు పుట్టాడని ఆ రోజు స్వామిని కొలిస్తే కష్టాలు తొలుగుతాయని నానుడి. దీంతో శ్రీకంఠపురం, టీచర్స్ కాలనీలోని శనీశ్వర దేవాలయాల్లో తెల్లవారు నుంచి స్వామి వారికి వివిద అభిషేకాలు అర్చనలు చేశారు. నువ్వుల ఒత్తులతో దీపాలు వెలిగించి వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్