కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… వారు రైతులతో చర్చలకు సమయం ఇవ్వాలని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకులు రాకేష్ టికాయత్ తెలిపారు. ‘దేశంలో సమస్యలు ఉన్నప్పుడు ఆందోళనలు (నిరసనలు) రేగుతాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారు చర్చల కోసం సమయం ఇవ్వాలి’ అని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ టికాయత్ తెలిపారు.