కదిరిలోని ఆలం ఖాన్ దర్గాలో శనివారం హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు బాలయ్యకు తలపాగా, వస్త్రం ధరించి ఆనవాయితీ ప్రకారం ప్రార్థనలు చేయించారు. దర్గాకు ప్రీతి పరమైన గంధపు పన్నీర్ను బాలయ్య సమర్పించారు. అనంతరం సామూహిక ప్రార్థనలు చేశారు. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.