కళ్యాణదుర్గం: చౌక ధాన్యపు దుకాణ ప్రారంభం

61చూసినవారు
కళ్యాణదుర్గం: చౌక ధాన్యపు దుకాణ ప్రారంభం
కుందుర్పి మండలం ఆపిలేపల్లి గ్రామంలో ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణంను టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ ఆదివారం ప్రారంభించారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధర్మతేజ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి, నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్