వారం రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు

84చూసినవారు
వారం రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామిరెడ్డి, శ్రీసత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు బకాయి వేతనాల కోసం సమ్మెకు దిగడంతో వారం రోజులుగా మున్సిపల్ కొళాయిల్లో నీరు రాక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విషయం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి వెళ్లడంతో. ఆదివారం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో పలు వార్డుల్లో నీటి సరఫరాకు ట్యాంకర్లను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్