కనగానపల్లిలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
కనగానపల్లి మండలం దాదులూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు పరిటాల శ్రీరామ్ వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బుట్రా చండ్రాయుడు, ఓబుళపతి నాయుడు, నారాయణప్ప, బులగొండ పెద్దన్న, సుధాకర్, ఉప్పర వెంకటేష్, వడ్డి రాము తదితరులు ఉన్నారు.