శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద సోమవారం టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని కొండంత భరోసా ఇచ్చారు. గతంలో మాదిరి లంచాలకు తావు లేకుండా ప్రజాదరణ పొందిన నాయకులకు నామినేటెడ్ పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.