శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లి, మునిమడుగు, గోరంట్ల మండలం వడ్డిపల్లి పంచాయతీ, రెడ్డిచెరువుకట్ట, కంబాలపల్లి, పెదకోడిపల్లి, పాతర్లపల్లి, బుచెర్ల , కొత్తూరు గ్రామాల నుండి సుమారు 50 కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ లోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీ లోకి చేరిన వారికి సవితమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.