జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండించిన బి. కె. పార్థసారథి

1561చూసినవారు
రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడిని శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి ఖండించారు. ఆదివారం వైయస్సార్ పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ ని పార్థసారథి పరామర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్