6మంది మట్కా బీటర్లు అరెస్టు

78చూసినవారు
రాయదుర్గం మండలంలోని ఈ.వీరాపురం గ్రామంలో శనివారం మట్కా ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ జయ నాయక్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మట్కా రాస్తున్న 6మందిని అరెస్టు చేసి వారి వద్ద 6 సెల్ ఫోన్లు, రూ. 1,35,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆన్ లైన్ లో మట్కా రాస్తూ కర్ణాటక ప్రాంతం బళ్లారికి పంపుతున్నారని తెలుసుకొని వారిని ఆరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు.

సంబంధిత పోస్ట్