బైరవానితిప్ప ప్రాజెక్ట్ కు చేరుతున్న వరదనీరు.. ఆనందంలో రైతులు

566చూసినవారు
బైరవానితిప్ప ప్రాజెక్ట్ కు చేరుతున్న వరదనీరు.. ఆనందంలో రైతులు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1642 అడుగులకు చేరుకుంది. 360 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని జల వనరుల శాఖ ఏఈ హరీష్ సోమవారం మీడియాకి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్