గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి

56చూసినవారు
రాయదుర్గం మండల పరిధిలోని మల్లాపురం లేఅవుట్ సమీపాన వెలసిన శ్రీ గజలక్ష్మి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పురోహితులు రాంప్రసాద్ శర్మ తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు అమ్మవారిని దర్శించుకుంటే శీఘ్రమే పెళ్లి జరుగుతుందని పేర్కొన్నారు. మంగళ, శుక్ర, పౌర్ణమి, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్