భక్తిశ్రద్ధలతో శ్రీవారి గరుడ పల్లకి ఉత్సవ వేడుకలు

82చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీవారి గరుడ పల్లకి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి ఉత్సవ మూర్తిని గరుడ పల్లకిపై కొలువ తీర్చి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపట్టారు. గోవింద నామస్మరణతో గరుడ పల్లకి ఉత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏడు రకాల కాకడ హారతులు అందించారు.

సంబంధిత పోస్ట్