విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ ట్రాక్టర్ మీదపడి కూలీ మృతి చెందిన సంఘటన కణేకల్లు మండలంలోని మాల్యంలో చోటుచేసుకుంది. పోలీసులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు బొమ్మనహళ్ మండలంలోని డీ. హోన్నుర్లో కొత్తగా నిర్మితమవుతున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు 33 కేవీ లైన్ ఏర్పాటుచేసే క్రమంలో ఈ ఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.