రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో దుండగులు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి ఊరి బయట ఉన్న రైతు తిప్పారెడ్డి ఇంట్లోకి దుండగులు చొరబడి మారణాయుధాలతో బెదిరించి నగలు, డబ్బుతో ఉడాయించారు. ఒక్కసారిగా మూడు బైకుల్లో దుండగులు మాస్కులు ధరించి నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి ఇంట్లో ప్రవేశించారు. బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.