నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన డాక్టర్లు

57చూసినవారు
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన డాక్టర్లు
జీవో నెంబర్ 85కు వ్యతిరేకంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో వైద్య అధికారులు రెండవ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. డాక్టర్ స్వాతి లక్ష్మీ మాట్లాడుతూ జీవో నెంబర్ 85 అమలు చేస్తే ప్రస్తుతం వైద్యాధికారులుగా పని చేయుచున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలన్నారు. దశలవారీగా నిరసన చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్