ఘనంగా ఆలయ వార్షికోత్సవం

56చూసినవారు
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
తాడిపత్రి పట్టణం సంజీవ్ నగర్ మొదటి రోడ్డులోని శ్రీవేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా ప్రారంభించారు. శనివారం ఉదయం ఆలయంలోని ప్రధాన మండపంలో మహా సంకల్పం, గణపతి పూజ కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కలశస్థాపన చేశారు. అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించి అభిషేకం, విశేష పూజాది కార్యక్రమాలు చేశారు.

సంబంధిత పోస్ట్