చికిత్స పొందుతూ యువకుడి మృతి

58చూసినవారు
చికిత్స పొందుతూ యువకుడి మృతి
తాడిపత్రి మండలం బుగ్గ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. కొలిమిగుండ్ల మండలం గొరివిమానుపల్లి గ్రామానికి చెందిన మధు (28) బుగ్గలో పని ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఎస్ఐ సాగర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్