భారత్ సాయంతోనే కోలుకున్నాం: విక్రమసింఘే

63చూసినవారు
భారత్ సాయంతోనే కోలుకున్నాం: విక్రమసింఘే
కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామ్య సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని అన్నారు. ఇందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్