యాడికి పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేపట్టిన సెల్ టవర్ పనులను ఆపాలంటూ స్థానికులు గురువారం అధికారులను కోరారు. టవర్ చూట్టు ఉన్న నివాసులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా అధికారులు ఎలా అనుమ తులు ఇచ్చారని పేర్కొన్నారు. అక్కడ ఓ ప్రైవేటు పాఠశాల ఉందని, భవిష్యత్తులో పిల్లలకు హాని కలిగితే ఎవరు బాధ్యులని వాపోయారు. అనుమతి రద్దు చేయాలని స్థానికులు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు వినతిపత్రాలు అందించారు.